ఎంపీ క‌విత‌కు మ‌రో అరుదైన గౌర‌వం

273
kavitha k
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్‌ ఎంపీ కవితను ఆహ్వానించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎంపి క‌విత‌ను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. కేర‌ళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సును ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు 23న ప్రారంభించనున్నారు.

sreeramakrishnan

తిరువనంతపురంలోని అసెంబ్లీ కాంప్లెక్స్ లో క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్…అనే అంశంపై స‌ద‌స్సు నిర్వహిస్తున్నారు. ఈకార్య‌క్ర‌మంలో యువ‌త‌నుద్దేశించి ప్ర‌సంగించాల్సిందిగా కేర‌ళ స్పీక‌ర్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కేర‌ళ సిఎం పినరయి విజయన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు దేశవ్యాప్తంగా 2 వేల మంది సామాజికంగా, రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా ఉన్న జాతీయ విద్యార్థులు ఈ స‌ద‌స్సులో పాల్గొంటార‌ని రామ కృష్ణ‌న్ లేఖ‌లో పేర్కొన్నారు.

- Advertisement -