నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు 23న ప్రారంభించనున్నారు.
తిరువనంతపురంలోని అసెంబ్లీ కాంప్లెక్స్ లో క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్…అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో యువతనుద్దేశించి ప్రసంగించాల్సిందిగా కేరళ స్పీకర్ కోరారు. ఈ కార్యక్రమంలో కేరళ సిఎం పినరయి విజయన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు దేశవ్యాప్తంగా 2 వేల మంది సామాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న జాతీయ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటారని రామ కృష్ణన్ లేఖలో పేర్కొన్నారు.