టికెట్ల కోసం బీజేపీ ఆఫీస్‌లో గందరగోళం..

443
bjp laxman
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం బీజేపీ ఆఫీస్‌లో గందరగోళం నెలకొంది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముందు ఆందోళనకు దిగారు నిజామాబాద్ బీజేపీ నేతలు. ఎంపీ అరవింద్,స్దానిక నేతలు టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు.

ఒక సామాజిక వర్గనికే టికెట్లు ఇస్తున్నారు అని లక్ష్మణ్‌ను నిలదీశారు సుగుణ( మనిక్ బండర్), అరుణ ( 47 వార్డు బబ్బిలి విధి), ప్రవీణ్ (కుమార్ గల్లీ 34) మండిపడ్డారు.

నిజామాబాద్ అర్బన్ లో ఓ మహిళకు వచ్చిన టికట్ ను వేరే వాళ్లకు ఇవ్వడం తో ఆందోళనకు దిగారు మహిళలు. ఎస్టి జనరల్‌ టికెట్‌ను మహిళకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కష్ట పడ్డ వాళ్లకు కాకుండా కొత్తగా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆందోళన చేస్తున్న వారికి లక్ష్మణ్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు శాంతించలేదు.

- Advertisement -