మహేశ్ బాబు మూవీలో నివేద థామస్

304
nivetha thomos
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈమూవీ మహేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈమూవీ తర్వాత సూపర్ స్టార్ గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటివలే ఈమూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈమూవీకి సంబంధించిన మరో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమూవీలో మలయాళ హీరోయిన్ నివేధా థామస్ ను తీసుకున్నారని సమాచారం. ఈసినిమాలో ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారని ఫిలీం నగర్ వర్గాల టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా నివేధా థామస్ తెలుగులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీతో పాటు నాని టక్ జగదీశ్ సినిమాలో నటిస్తుంది. కాగా సర్కారు వారి పాట సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు మహేశ్ బాబు బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -