అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లుఃమంత్రి హరీశ్ రావు

221
harish rao
- Advertisement -

రాష్ట వ్యాప్తంగా అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దంతాన్ పల్లి, సికిండ్లపూర్ గ్రామాలలో 4 కోట్ల రూపాయల తో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునితరెడ్డి, పలువురు అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామి ఇచ్చారు. త్వరలో శివంపేటకు కాళేశ్వరం నీళ్లు అందిస్తామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృధ్ధికోసం 75 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోడ్లకు గాను 112 కోట్లు మంజూరు చేశామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

- Advertisement -