నా జీవితంలో ఇవే చివరి ఎన్నికలు- నితీష్‌ కుమార్‌

121
Nitish Kumar
- Advertisement -

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్య పార్టీలు ప్రచారం హోరా హోరీగా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. బిహార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు నితీష్‌ తేల్చి చెప్పారు.

‘బిహార్‌ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్‌ పలుకుతున్నా..’ అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇప్పటికే బిహార్‌లో రెండు దశల పోలింగ్‌ ముగియగా.. ఆఖరిదైన మూడో దశ నవంబర్‌ 7న జరగనుంది. కాగా బిహార్‌ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి.

- Advertisement -