అఖిల్‌ మూవీ…నితిన్‌కు ఊరట

244
Nithin Gets Final Relief From 'Akhil'
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రేష్ట మూవీ బ్యానర్‌పై నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించగా బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. దీనికి తోడు అఖిల్ మూవీ రైట్స్‌కు సంబంధించి నితిన్‌తో పాటు ఆయన సోదరి నిఖితా రెడ్డిలపై గంగాథర సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అఖిల్ సినిమా హ‌క్కుల విష‌యంలో త‌న వ‌ద్ద రూ.50 లక్షలు తీసుకుని, హక్కులు ఇవ్వకుండా మోసం చేశారంటూ పిటీష‌న్‌లో తెలిపాడు గంగాధ‌ర స‌త్య‌నారాయ‌ణ‌. ఈ కేసుకి సంబంధించి వారికి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.

దీనిపై ప‌లు కోర్టుల‌లో పిటీష‌న్స్ దాఖ‌లు చేశారు నితిన్ కుటుంబ స‌భ్యులు. స‌త్యనారాయ‌ణ త‌మ పైన త‌ప్పుడు కేసు పెట్టార‌ని, ఆయ‌న శ్రేష్ట్ మూవీస్ సంస్థ‌లో భాగ‌స్వామి కాద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నితిన్ త‌ర‌పు న్యాయ‌వాది. ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్‌ వివాదమని, క్రిమినల్‌ కేసు పెట్టడం సరికాదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేసు కొట్టి వేసింది. దీంతో నితిన్‌కి ఊర‌ట ల‌భించింది.

- Advertisement -