ఏఈఓపై పోలీసుల చర్య… దురదృష్టకరం: నిరంజన్ రెడ్డి

248
niranjan reddy
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఏఈఓపై పోలీసులు దాడి చేసి కొట్టడం దురదృష్టకరమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం… అప్పాజీపల్లి చిన్న ఘనపూర్. కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది కలిగించవద్దు అని పిఎసిఎస్ అధికారులకు చైర్మన్ లకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

- Advertisement -