Niharika:వాళ్లిద్దరూ విడిపోయారు

53
- Advertisement -

గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు నిహారిక- జొన్నలగడ్డ చైతన్య. 2020 డిసెంబర్ 9న రాజస్ధాన్‌లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహాం జరుగగా హిందూ ధర్మచట్టం ప్రకారం విడాకులకు అప్లే చేశారు కొణిదల నీహారిక. గతంలో ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగగా ఆ ప్రచారానికి తెరదింపుతు విడాకులకు దరఖాస్తు చేసింది నిహారిక. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేశారు.

అయితే వీళ్లు విడిపోవడానికి కారణమేంటో తెలియలేదు. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడంతో వీళ్లు విడిపోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. తర్వాత కొన్ని రోజులకే నిహారిక కూడా తన భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లకు నిహారిక సింగిల్ గా రావడం కూడా అనుమానాలను మరింత బలపరిచింది.

Also Read:రోజంతా కూర్చొని పని చేస్తున్నారా.. జాగ్రత్త!

ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

- Advertisement -