ఏపీలో నైట్ కర్ఫ్యూ…

122
jagan
- Advertisement -

దేశంలో థర్డ్ వేవ్ విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ నైట్‌ కర్ఫ్యూ విధించాలని సూచించారు సీఎం జగన్. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన జగన్‌…. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయనున్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు.

కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్‌ అన్నారు.థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే… సీటు మార్చి సీటుకు అనుమతించాలన్నారు. మాస్క్‌తప్పనిసరి చేయాలన్నారు.

- Advertisement -