దావుద్‌పై రివార్డు ప్రకటించిన ఎన్‌ఐఏ

130
dawod
- Advertisement -

1993లోని ముంబాయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావుద్‌ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25లక్షలు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు గురువారం వెల్లడించారు.

దావుద్‌ ఇబ్రహీం తో పాటుగా అతడి అనుచరులు చోటా షకీల్‌పై రూ.20లక్షలు హజి అనీస్‌ అలియాస్‌ అనీస్‌ ఇబ్రహీం షేక్‌ జావెద్‌ పటేల్‌ అలియాస్‌ జావెద్‌ చిక్నా ఇబ్రహీం ముస్తక్‌ అబ్దుల్‌ రజాక్‌ మేమన్‌ అలియాస్‌ టైగర్‌ మెమన్‌పై రూ.15లక్షల చొప్పున రివార్డు ప్రకటిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వీరంతా 1993 ముంబాయి వరుస పేలళ్ల ఘటనలో నిందితులగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎలాంటి సమాచారం తెలిసినా దర్యాప్తు సంస్థకు చేరవేయాలని అధికారులు తెలిపారు.

దావుద్‌ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా డి కంపెనీ పై ఎన్‌ఐఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఆయుదాల స్మగ్లింగ్‌, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్‌ క్రిమినల్‌ సిండికేట్‌, మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోందని ఏన్ఐఏ అరోపించింది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. పాక్ ఆధారంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా జైషే మహ్మద్‌, అల్‌ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలకు కీలక సహకారం అందిస్తూ, భారత్‌లో గడిచిన 20 ఏళ్లలో అనేక అల్లర్లకు ప్రధాన కారకులుగా ఉన్నారు. వివిధ అంతర్జాతీయ ఉగ్ర మూఠాలకు కీలక సహకారం అందిస్తున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది.

2018లో ఐరాసలో విడుదల చేసిన అంతార్జాతీయ ఉగ్రసంస్థలు ఉగ్రవాదుల జాబితాలో దావుద్ పేరు కరాచీ అడ్రస్సుతో ఉంది. ఇప్పటికే పలుమార్లు భారత్‌ దావుద్‌కి పాక్‌ ఆశ్రయమిస్తోందని పలు అంతార్జాతీయ సంస్థల వేదికలపై చెబుతు వచ్చింది. 1993లో దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో వరుస పేలళ్ల కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్నారు. ఈ పేలళ్లు ఘటనలు కేవలం గంటల వ్యవధిలో 12 చోట్ల భీకర బాంబు పేలుళ్లు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో 257మంది ప్రాణాలు కోల్పోగా…800మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -