ఏపీ 203 జీవోకి గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్..

276
ngt
- Advertisement -

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి కెపాసిటీ పెంపునకు విడుదల చేసిన జీవోపై ఎన్జీటీ స్టే విధించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించిన ఎన్జీటీ…ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించిన ట్రిబ్యునల్‌ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

- Advertisement -