కివీస్ చేతిలో భారత్ ఘోర పరాజయం..

126
nz
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. కివీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో దాదాపుగా భారత్ సెమీస్ ఆశలు గల్లంతయినట్లే. భారత్ విధించిన 111 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది న్యూజిలాండ్.ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా విలియమ్సన్ 33, గుప్టిల్ 20 పరుగులతో రాణించారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభం నుండే తడబడింది. ఒక్కొక్కరుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు చేరగా ఓ దశలో భారత్ కనీసం వంద పరుగుల మార్క్‌నైనా దాటుతుందా అనే సందేహం వ్యక్తమైంది. చివరలో జడేజా (19 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌)రాణించడంతో కనీసం ఆ పరుగులైనా చేయగలిగింది. బర్త్‌ డే బాయ్‌ ఇష్‌ సోధి (2/17) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

- Advertisement -