శోభనం గదిలో ఎన్నికల ప్రచారం..

353
janasena
- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలన్ని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మునిగితేలాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలుతుండగా వారిని అభిమానించే వారు సైతం సోషల్ మీడియా లేదా డోర్ క్యాంపెయిన్ ద్వారా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సారి ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. కొంతమంది ఏకంగా పెళ్లిపత్రికలపై తమ నాయకుడికి ఓటేయాలంటూ గిఫ్ట్ లు అవసరం లేదని ప్రచారం చేస్తుండగా మరికొంతమంది ఏకంగా ఇంకోఅడుగు ముందుకేసి ఏకంగా శోభనంనే ప్రచార అస్త్రానికి వాడుకుంటున్నారు.

ఏపీలో పవన్ కల్యాణ్ జనసేనకు ఓటేయాలంటూ ఆయన ఫ్యాన్స్ కొంతకాలంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి ఏకంగా శోభనం రోజున తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్‌ జనసేనపై ఉన్న అభిమానంతో శోభనం గదిలో పాల గ్లాసును కాస్త పూల గ్లాసుగా మార్చేశారు.

సాధారణంగా శోభనం గది మంచాన్ని పూలతో అలంకరిస్తారు. కానీ ఈ పెళ్లికొడుకు కాస్త వెరైటీగా మంచాన్ని పూలతో అలంకరించడంతో పాటు జనసేన పార్టీ సింబల్ గ్లాస్‌ గుర్తును పూలతో అలంకరించి జనసేనకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. అంతేగాదు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.అయితే దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

- Advertisement -