26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ- సీఎం కేసీఆర్

132
kcr
- Advertisement -

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే పంపిణీ నిర్వహించాలన్నారు.

జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.

- Advertisement -