మందుబాబుల విన్నపం.. ఇదే మా చివరి ఓటు..

134
ap liquor
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాసిన స్లిప్పులు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఇలాంటి స్లిప్పులే బయటపడ్డాయి… కానీ వాటిలో రాసిన విషయం మాత్రం వేరే ఉంది.! నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాల 29వ వార్డు బ్యాలెట్ బాక్సులను తెరిచిన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ ప్రభుత్వన్ని ఉద్దేశించి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని… రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని మందుబాబులు ఇలా విన్నవించుకున్నారు. ఇది విచిత్రంగా ఉన్న నమ్మక తప్పదు మరి.!!

- Advertisement -