ఢిల్లీ కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్‌..

181
delhi
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గెజిట్ విడుదల చేసింది కేంద్రం. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు కూడా ఈ ఆర్డినెన్స్ కిందకు తీసుకువచ్చిన కేంద్రం….కమిషన్ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపింది.

ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కేంద్ర అటవీ పర్యవరణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి,ఎక్స్ అఫిషియో సభ్యులుగా పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన కార్యదర్శి లేదా, పర్యావరణ సంబంధ వ్యవహారాలు చూసే కార్యదర్శి స్థాయి అధికారులు ఉంటారని తెలిపింది.పర్యావరణ సంబంధిత వ్యవహారాల్లో సాంకేతిక నిపుణులు గా ఉన్న ముగ్గురిని పూర్తికాలం సభ్యులుగా నియమించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సాంకేతిక సభ్యుడు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కమిషన్ లో ఉండాలని తెలిపిన కేంద్రం….ఇస్రో నామినేట్ చేసిన ఒక సభ్యుడు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటాడు.ఎన్జీవో ల నుంచి ముగ్గురు వ్యక్తులు కమిషన్ లో సభ్యులుగా ఉంటారు.నీతి ఆయోగ్ నుంచి సంయుక్త కార్యదర్శి లేదా, సలహాదారు స్థాయి అధికారి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపింది.

ఉపరితల రవాణా, విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పెట్రోలియం, వ్యవసాయ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల నుంచి ఒక్కొక్క అధికారిని సభ్యులుగా నియమించుకునే అవకాశం కమిషన్ కి కల్పించిన కేంద్రం.అధికారుల మధ్య సమన్వయం కోసం కార్యదర్శి స్థాయి అధికారి.ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టేందుకు అన్ని రకాల అధికారులు కల్పిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం.

కాలుష్య నియంత్రణ, చేపట్టాల్సిన చర్యలు, పరిశోధనల కోసం ఉప సంఘాలను కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని….ఈ ఉప సంఘాల్లో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.ఇటీవల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం సహా ఇతర కాలుష్య కారకాలు పెరుగుతుండటం పై తీవ్రస్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు.విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి తో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.

అయిన ఆయా రాష్ట్రాల్లో సమన్వయం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పై దృష్టి సారించిన కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తునే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గజిట్ తీసుకొచ్చింది.

- Advertisement -