ఒక ప్రాణానికి ప్రతీకారంగా.. 300 మొసళ్లను చంపేశారు..

206
indonesia
- Advertisement -

ఒక ప్రాణం తీసిందని.. ప్రతీకారంగా మూడు వందల మొసళ్ల ప్రాణాలు తీశారు ఓ ఊరు జనం. ఊరు ఊరంతా ఏకమై వాటిపై కొడవళ్లు, కత్తులతో దాడి చేసి చంపేశారు. వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మొసలి ఉన్న ఎన్ క్లోజర్ లో పడిపోయాడు. ఆ వ్యక్తిని మొసలి చంపేసింది. తరచూ మొసళ్ల వలన ఎవరో ఒకరు మరిణిస్తుడడంతో ఆగ్రహించిన ఊరు జనం, అతని అంత్యక్రియలు చేసిన రోజునే ప్రతీకారంగా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా 300 మొసళ్లను చంపేశారు.

Indonesia

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ… ఈ ఘటనను తాము అడ్డుకోలేక పోయామని, చాలా ప్రయత్నించామని.. కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆగ్రహంతో ఉన్న ఊరు జనాలను కంట్రోల్ చెయ్యలేకపోయామని చెప్పారు. ఓ వ్యక్తిని మొసలి చంపేసిందని, బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఊరు జనం డిమాండ్ చేశారని, బాధితుడికి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్ క్లోజర్ సిబ్బంది అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే వందల మంది నివసిస్తున్న ఇళ్ల మధ్య మొసళ్ల ఎన్ క్లోజర్ ని తొలిగించాలని, ఎంతో మందిని మొసళ్లు చంపుతూనే ఉన్నా తొలిగించడం లేదంటూ ఆగ్రహంతో మొసళ్ల ఎన్ క్లోజర్ దగ్గరికి వెళ్లి, అక్కడ ఉన్న అన్ని మొసళ్లను చంపేశారని, మేము ఈ ఘటనను అడ్డుకోలేక పోయామని చెప్పుకొచ్చారు పోలీసులు.

- Advertisement -