చిక్కుల్లో నయన్…విఘ్నేశ్‌ ఏమన్నాడంటే?

59
nayan
- Advertisement -

కోలీవుడ్ హాట్ కపుల్ నయనతార – విఘ్నేశ్‌ శివన్ జంట చిక్కుల్లో పడ్డారు. పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించగా అంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లి తర్వాత రెండుసార్లు హానీమూన్‌కు వెళ్లింది ఈ జంట..ఎక్కడా నయన్ గర్బంతో ఉన్నట్టు కనిపించలేదు. హానిమూన్ ఫోటోలను కూడా షేర్ చేయగా వాటిని ఇప్పుడు వైరల్ చేస్తూ నెటిజన్లు ఈ జంటను ఏకిపారేస్తున్నారు.

సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చట్ట విరుద్ధం అయినప్పటికీ… ఈ విధానం ద్వారా వీరు పిల్లలని కన్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, నీతోనే ఉంటూ, నీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించే వారి గురించి మాత్రమే ఆలోచించాలని విఘ్నేశ్ అన్నారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పారు.

అసలు సరోగసీ విధానం అంటే అద్దె గర్భం. 2019లోనే సుప్రీంకోర్టు అద్దెగర్బం ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. అయితే ప్రస్తుతం నయన్ – విఘ్నేశ్ జంట ఒకవేళ సరోగసి ద్వారా పిల్లలను కంటే ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

- Advertisement -