నారా లోకేష్ మళ్లీ టంగ్ స్లిప్..

545
nara lokesh
- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ మళ్లీ టంగ్ స్లిప్ అయ్యాడు. గతంలో అనేకసార్లు నోరు జారీన లోకేష్ తాజాగా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గుంటూరు టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లోకేష్. కలాం గొప్పదనం గురించి చెప్పబోయి నోరు జారారు. 2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని చర్చ జరిగినప్పుడు.. ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారు అన్నారు.

వాస్తవానికి 2012లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ లోకేష్…వాజ్‌ పేయ్ పేరును ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు లోకేష్‌పై సెటైర్లు విసురుతున్నారు.

- Advertisement -