లోకేష్‌ మళ్లీ… వేసేశాడు !

248
- Advertisement -

సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్‌కి సంబంధించిన వార్తలే వైలర్‌ అవుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో…  ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున.. వర్ధంతి అని.. ఏప్రిల్ 18న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో పర్యటిస్తూ ..‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని… అనంతపురం జిల్లాలో పర్యటించిన లోకేశ్ వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని.. ఇలా ప్రతీ మీటింగ్‌లో పొరపాటు పడ్డ ఏపీ యువ మంత్రి నారా లోకేష్ మరోసారి పప్పులో కాలేశాడు. ఓ కార్యక్రమంలో  ఆయన మాట్లాడినప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్లయిందంటూ మరోసారి తనేంటో చూపించాడు. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని… స్కూల్ పిల్లలను అడిగినా గుక్క తిప్పుకోకుండా సమాధానమిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.

- Advertisement -