పైసా వసూలా..? పంపకమా..?

193
- Advertisement -

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు. స్వయంగా బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాలను రోడ్‌ షోలో ఏకరువు పెట్టిన బాలకృష్ణ.. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యాలని నంద్యాల ప్రజలను కోరి.. మళ్లీ అదే వాహనం మీది నుంచి వారికి డబ్బులు పంచడం విస్మయానికి గురి చేస్తోంది.

Nandyal bypoll: Nandamuri Balakrishna in controversy again

బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ రోడ్‌ షోలో మాట్లాడుతున్నారు. కాగా, బాలకృష్ణ డబ్బులు పంపిణీ వ్యవహారం ఎన్నికల కమిషన్‌(ఈసీ) దృష్టికి వెళ్లింది.

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలను ఈసీ, పలువురు ముఖ్య అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా, రోడ్‌ షో అనంతరం ఓ హోటల్లో బస చేయడానికి వెళ్లిన బాలకృష్ణ.. అక్కడికి ఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -