14 నుండి సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

4
- Advertisement -

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 14 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 13వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూలై 14న ఉదయం 7.45 నుండి 8.15 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ

14-07-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

15-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

16-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

Also Read:విశ్వక్ సేన్..’లైలా’ గ్రాండ్ లాంఛ్

17-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హనుమంత వాహనం

18-07-2024

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

19-07-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

20-07-2024

ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)

రాత్రి – గజ వాహనం

21-07-2024

ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు)

రాత్రి – అశ్వవాహనం

22-07-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

- Advertisement -