రేవంత్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..

177
revanth
- Advertisement -

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు…ఈ కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.

రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి. అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

ఈ కేసులో సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి.

- Advertisement -