గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నల్లగొండ ఎస్పీ రంగనాథ్

401
Sp Ranganath
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వెల్స్ ఫర్గో సంస్థ అధినేత శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాథ్. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మూడు రకాల పండ్ల మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు పెంచటం అందరి అభిమతంగా మారినప్పుడే గ్రీన్ ఛాలెంజ్, హరితహారం లాంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందన్నారు. గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించాల్సిందిగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిలను మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

- Advertisement -