అమెరికాలో నల్గొండ వాసి దుర్మరణం..

116
us
- Advertisement -

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి మృతిచెందారు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు మాస్టర్‌ డిగ్రీ చదివేందుకు 2021 జూన్‌ 23న అమెరికా వెళ్లారు. పెద్ద కుమారుడు చంద్రకాంత్‌రెడ్డి క్యూవేర్‌లాండ్‌ యూనివర్సిటీలో, చిన్న కొడుకు క్రాంతికిరణ్‌రెడ్డి ముస్సోరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చేస్తున్నారు.

క్రాంతికిరణ్‌రెడ్డి మాస్టర్‌ డిగ్రీ ఆగస్టులో పూర్తి కానుండగా ఈ నెల 7న క్రాంతికిరణ్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులు కలిసి కారులో మరో స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తుండగా ముస్సోరిలో ట్రక్కు ఢీకొట్టింది. దీంతో క్రాంతికిరణ్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -