సీనియర్ హీరో నాగర్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ అనుకోని విధంగా డిజాస్టర్ అనిపించుకుంది. నాగ్ నుండి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టైలిష్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియన్స్ ను ఆ సినిమా బాగా నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా తర్వాత నాగ్ నెక్స్ట్ సినిమా చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు రైటర్ ప్రసన్న తో నాగ్ సినిమా లాక్ అయింది.
సినిమా చూపిస్తా మావ తో రైటర్ గా పరిచయమైన ప్రసన్న వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేశాడు. తాజాగా రవితేజ ధమాకా కి కూడా ప్రసన్న కథ -స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు. ఇటివలే నాగార్జున ని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించాడట ప్రసన్న. నాగ్ కి స్క్రిప్ట్ తో పాటు ప్రసన్న నెరేషన్ బాగా నచ్చడంతో తననే డైరెక్ట్ చేయమని చెప్పేసి లాక్ చేసేశాడట.
ఈ కాంబో సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించనున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. మరి రైటర్ ప్రసన్న తనకి వచ్చిన డైరెక్షన్ చాన్స్ ను ఎలా వాడుకుంటాడో ? నాగ్ తో కలిసి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి…