ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ వరుస హిట్లతో దూసుకువెళ్తున్నాడు, చేసింది మూడు సినిమాలే అయిన యూత్లో ఓ మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు రాజ్తరుణ్, రాజ్ తరుణ్ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కింగ్ నాగార్జున అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ హీరోగా పరిచయం అయిన ఉయ్యాల జంపాల సినిమాను రాధామోహన్తో కలిసి నాగార్జున సంయుక్తంగా నిర్మించాడు. ఆ తరువాత రాజ్ తరుణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.
రాజ్ తరుణ్ కు ఉయ్యాల జంపాల సినిమా తరువాత అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని కమిట్ మెంట్ ఉందట. ఇప్పటి వరకు అది కుదరలేదు ఆఖరికి ఇప్పుడు అది ఫైనల్ అయింది. డిసెంబర్ 1న ఈ సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారు. తమిళ దర్శకురాలు రంజని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఓ పక్క పెద్ద సినిమాలను నిర్మిస్తూనే చిన్న బడ్జెట్ సినిమాలకు తన సహకారం అందిస్తున్నారు నాగార్జున. ఇటీవలే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాను నాగార్జున నిర్మించిన సంగతి తెల్సిందే. కింగ్ నాగార్జునకు ఈ సినిమా పెద్దగా లాభాలను తెచ్చిపెట్టలేదట. రాజ్తరుణ్తో చేయబోయే సినిమాతో పాటు,.. విక్రమ్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా త్వరలోనే ఓ సినిమాను నిర్మించబోతున్నాడట నాగార్జున.
అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ రాజుగాడు విడుదలకు సిద్ధమైంది. అందగాడు సినిమా వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో సగం పూర్తయింది. అన్నపూర్ణ బ్యానర్ సినిమాతో కలిపి రాజ్తరుణ్కు ప్రస్తుతం మూడు సినిమాలు అన్నమాట. ఇది కాక, ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ లో మారుతి కథతో ఓ సినిమా చేయాల్సి వుంది రాజ్తరుణ్. కింగ్ నాగార్జున నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నందుకు పుల్ హ్యాపీగా ఉన్నాడట ఈ యంగ్హీరో.