నాగార్జునతో నరేష్ ఫిక్స్ ?

1172
- Advertisement -

ది ఘోస్ట్ పరాజయం తర్వాత నాగార్జున ప్రసన్న కుమార్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ప్రసన్న ఈ సినిమా కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు. మలయాళం సూపర్ హిట్ మూవీ పొరింజు మరియం జోస్ సినిమా నుండి కొంత భాగం తీసుకొని కాస్త మార్పులతో తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ప్రసన్న.

అయితే ఈ సినిమాలో నాగార్జున తో కలిసి అల్లరి నరేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు ప్రసన్న. త్వరలోనే మేజర్ రోల్స్ కి యాక్టర్స్ ని ఫైనల్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ ఫ్యాన్స్‌ కు డబుల్ కిక్ !

2023లో రైటర్ పద్మభూషణ్..

మొన్న వీరసింహా రెడ్డి , ఇప్పుడు వీరయ్య

- Advertisement -