ఎంపీ సంతన్న సవాల్‌ను స్వీకరించిన నాగార్జున..

238
MP Santosh Kumar
- Advertisement -

పచ్చ‌ని మొక్క ప్ర‌ణ‌వాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మ‌నిషిని కాపాడుతుంది. నిరంత‌ర కాలుష్యంతో ప్ర‌మాద‌పుటంచును తాకుతున్న మాన‌వాళిని జాగృతం చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌లు అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ‌ సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన ఉద్య‌మ‌మే హ‌రిత‌హారం. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంచుకున్న మార్గమిది. మొక్క‌లు నాట‌డ‌మే దీని ఉద్ధేశ్యం. ఈ హరితహారం కార్యక్రమంలో మేము సైతం అంటూ ప‌లువురు రాజకీయ ప్రముఖులు, సినీతార‌లు ముందుకొచ్చారు.

Nagarjuna Accepted Green Challenge

ఈ హరితహారం ఛాలెంజ్‌లో భాగంగా..ఇటీవల తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సవాల్‌ను విసిరాడు. అయితే హోం మినిస్టర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి స్వయంగా మొక్కలను నాటారు ఎంపీ సంతోష్ కుమార్. అంతేకాదు ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు ఈ హరితహారం ఛాలెంజ్‌ను విసిరారు. రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడుక, గవర్నర్ నరసింహన్, హీరో నాగార్జునకి ఛాలెంజ్ విసిరారు. తాజాగా ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్ చేసినందుకు థాంక్యూ ఎంపీ సంతోష్ గారు. నేను నా యాక్సెప్టెన్స్‌కి ప్రూఫ్ త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే నేను నా ఫ్రెండ్స్‌లో కొందరిని ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లమని కోరుతాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Governor Narasimhan

ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తోపాటు ఆయన సతీమణి విమల నరసింహన్, రాజ్‌భవన్ అధికారులు కూడా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటి… ఆరోగ్యకరమైన వాతావరణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలా హరితహారం ఛాలెంజ్‌కు ఎంతో మంది ప్రముఖుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

- Advertisement -