నాగ చైతన్య @ ‘తండేల్’

29
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌, పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.

మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనేదానిపై ప్రత్యేక ద్రుష్టిపెట్టారు. ఈ కథని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళి చూపించాలి. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి చాలా అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేయాలని నిర్ణయించుకొని, ఈ కథకు నాగచైతన్య సరిపోతారని ఆయన్ని దగ్గరకి తీసుకెళ్ళినపుడు ఆయన ఎక్సయిట్ అయ్యారు. నాగచైతన్యకు సరైన జోడిగా మా బంగారు తల్లి సాయిపల్లవి వచ్చారు. ఈ మధ్య సినిమాని పెద్దగా చూడటం అలవాటైయింది. అలాగే పెద్దగా తీయాలి, పెద్దగా రిలీజ్ చేయాలి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైనపుడు పాన్ ఇండియా సౌండ్ అలవాటు చేసిన దేవిశ్రీ ప్రసాద్ రావడం, ఆలాగే అద్భుతమైన కెమరామ్యాన్ షామ్‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇలా అద్భుతమైన టీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం చాలా అనందంగా వుంది. ఈ కథని భాను రియాజ్ కార్తిక్ మా వద్దకు తీసుకొచ్చారు, నిజంగా జరిగిన కథ ఇది. ఇలాంటి కథ గీతా ఆర్ట్స్ లో తీస్తే బావుటుందని వాసు దగ్గరకి తీసుకొచ్చారు. ప్రీప్రొడక్షన్ వర్క్ లో టీం అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నపుడు చాలా సంతోషంగా అనిపించింది. సినిమాని ఇలా తీయాలి కదా అనే తృప్తి వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చి టీంని అభినందించిన నాగార్జున గారు, వెంకటేష్ గారికి ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా కథపై వర్క్ చేశాం. వాసు గారు అరవింద్ గారు అద్భుతంగా ప్రోత్సహించారు. నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తాను అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూవస్తున్నాం. ప్రీప్రొడక్షన్ లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయి. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాసపై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా విషయాలపై ప్రత్యేక ద్రుష్టితో పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రోసస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇది ప్రతి సినిమాలా కాదు చాలా ప్రత్యేకమైనదని, బలమైన కథ, కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్ గారు ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కథకు కావాల్సిన బడ్జెట్, సపోర్ట్ ఇస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. నా కెరీర్ లో గుర్తుండిపోయే సక్సెస్ 100% లవ్ అరవింద్ గారే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వాసు గారికి ధన్యవాదాలు. చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు. తనతో ప్రతి విషయాన్ని ఓపెన్ గా చర్చించగలుగుతాను. మా ఇద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. సాయి పల్లవి చాలా పాజిటివ్ ఎనర్జీ వున్న యాక్టర్. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు, షామ్‌దత్, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని కోరారు.

Also Read:పిక్ టాక్ : తమన్నా అందాల అరాచకం

- Advertisement -