లవ్ స్టోరీ..పుకార్లను నమ్మకండి: నిర్మాతలు

268
naga chaitanya
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని తెలిపారు నిర్మాతలు. సాయి పల్లవి తన నటనతో చైతూను డామినేట్ చేసిందని…దీంతో కొన్నిసీన్లను తిరిగి రీ షూట్ చేస్తున్నారని టీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలపై స్పందించిన చిత్రయూనిట్ ఇవన్నీ పుకార్లు మాత్రమేనని వాటిని నమ్మోద్దని సూచించింది. ఈ సినిమాలో ఇద్దరికి సమానమైన పాత్రలు ఉన్నాయని…కరోనా కారణంగా మాత్రమే సినిమా షూటింగ్ వాయిదా పడిందని చెప్పుకొచ్చింది.

- Advertisement -