లోకేశ్‌పై ఏబీఎన్‌ స్టోరీ..నాగబాబు ఫన్నీ సెటైర్

244
Naga Babu Super COMEDY on Nara Lokesh
- Advertisement -

సోషల్ మీడియా వేదికగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై సెటైర్లు వేశారు మెగా బ్రదర్ నాగబాబు. ‘మై చానల్ నా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో ఓ చానల్ ను ప్రారంభించిన నాగబాబు మరోసారి లోకేశ్‌ని టార్గెట్ చేశారు. ఇటీవల దావోస్‌లో పర్యటించిన లోకేశ్‌ ఏపీకి పెట్టుబడుల కోసం విశేష కృషి చేశారని ఏబీఎన్ కథనాన్ని ప్రచారం చేసింది.

దావోస్ లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సమయంలో లోకేశ్ కు ఓ వింత అనుభవం ఎదురైందని, దాంతో మైన్ 15 డిగ్రీల చలిలోనూ వారిలో వేడి పుట్టిందని చెబుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఓ కథానాన్ని చూపిస్తూ, నటుడు నాగబాబు కామెడీ సెటైర్లు వేశారు. లోకేశ్ బాబు విషయంలో కన్న తండ్రికన్నా ఏబీఎన్ చానల్ వాళ్లు పొంగిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి…

https://youtu.be/wEqpYrkZ2SE

- Advertisement -