మై ఛానల్ నా ఇష్టం పేరుతో ఇటీవలె యూ ట్యూబ్ ఛానల్ను ప్రారంభించిన మెగా బ్రదర్ నాగబాబు రోజుకో న్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణతో ప్రారంభమైన నాగబాబు అటాక్ లోకేష్,చంద్రబాబు చివరికి టీడీపీని సైతం తనదైన శైలీలో తూర్పారబట్టారు. పవన్పై విమర్శలు చేసేవారికి ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా వైసీపీ నేత,సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరుణ్తేజ్తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25 కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మును విరాళంగా ఇచ్చారని… ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేనకు విరాళంగా ఇచ్చారని పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ఫైర్ అయ్యారు. పృథ్వీ వద్ద తన ఫోన్ నెంబర్ ఉందన్న నాగబాబు పృథ్వీ దగ్గర తన ఫోన్ నంబరు ఉందని, అతడికేమైనా అనుమానాలుంటే తనకు నేరుగా ఫోన్ చేసి అడగొచ్చని సూచించాడు. జనసేనకు తామిచ్చిన విరాళం అధికారికమేనని స్పష్టం చేసిన నాగబాబు తమ కుటుంబంపై బురద జల్లడం ఇది కొత్తకాదని చెప్పుకొచ్చాడు. అసలు పృథ్వీ అలా అన్నాడంటే నమ్మలేకుండా ఉన్నానని ..ఒకవేళ పృథ్వీ అలాంటి వ్యాఖ్యలు చేసిఉంటే వ్యక్తిగతంగా కలిసి సమాధానం చెబుతానని హెచ్చరించారు.