మొక్కలు నాటిన ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు..

242
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఎంపీపీ శరత్ రావు స్వామి ….ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంలోని మెట్టు పోచమ్మ దేవాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణలో ప్రతి ఒక్కరూ విరిగా మొక్కలు నాటేలా చైతన్యం తీసుకొస్తున్నారు గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇదే స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపును ఇచ్చారు.

- Advertisement -