విక్టరీతో ఐపీఎల్ ముగించిన ముంబై..

40
mi
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌కు విక్టరీతో ముగించింది ముంబై. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడగొట్టి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. ఢిల్లీపై ముంబై గెలుపుతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది ఆర్సీబీ. ఢిల్లీ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది. ఇషాన్‌ కిషన్ (48), బ్రెవిస్ (37), టిమ్‌ డేవిడ్ (34), తిలక్ వర్మ (21), రమణ్‌దీప్‌ (13*) రాణించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా 24,పావెల్ 43,పంత్ 39 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశారు.

- Advertisement -