ముంబై నగరం..నీట మునిగిన వేళ!

7
- Advertisement -

ముంబై మహానగరాన్ని వరదలు మంఉచెత్తాయి. గత 24 గంటల్లో 944 మిల్లీమీటర్ల వర్షం పడగా 914 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే 644 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఇది ప్రపంచంలో 24 గంటల్లో నమోదైన ఎనిమిదవ అతిపెద్ద వర్షపాతం గా నమోదైంది.

ప్రతీ సంవత్సరం వర్షాకాలం ముంబైని వర్షాలు ముంచెత్తుతాయి కానీ 2005 జూలై 26 వ తేదీ మాత్రం ముంబై చరిత్రలో మర్చిపోలేని, విషాదభరితమైన రోజుగా నిలిచిపోయింది.

ఈ విపత్తు కారణంగా నగర వాసులపై తీవ్రమైన ప్రభావం పడింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోలను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. వర్షపు నీటిలో రోడ్లు మునిగిపోగా ట్రాఫిక్, నిలిచిపోయింది. ముంబైకి ప్రాణవాయువులా పనిచేసే లోకల్ ట్రెయిన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాక్‌లు నీటమునిగిపోవడం, 52 రైళ్లకు నష్టం తలెత్తడంతో వేలాది మంది స్టేషన్లు, స్కూల్లు, కార్యాలయాల్లో రాత్రులు గడిపారు. ధారావి, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి.

 

Also Read:ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పు..

- Advertisement -