ముగిసిన శాసనసభ సమావేశాలు

43
- Advertisement -

తెలంగాణ శాసన సభ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్‌ పద్దులపై చర్చల ముగింపు తర్వాత రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈనెల 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలై చివరి రోజు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ పద్దులపై చర్చించారు. మొత్తం 56.25గంటల పాటు జరిగిన బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాయి. ఇందులో ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు. చివరగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. శాసన సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి…

మోదీ అదానీపై స్పందించాలి..కేసీఆర్‌

దొందు దొందే…సీఎం కేసీఆర్‌

బస్తీ దవాఖానాలో 134రకాల పరీక్షలు

- Advertisement -