పవన్‌పై మరోసారి ముద్రగడ ఫైర్

14
- Advertisement -

జనసేన అధినేత పవన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ కళ్యాణ్‌ను ముద్రగడ కూతురు క్రాంతి కలిసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తానని మాట ఇచ్చారు పవన్. ముద్రగడ, క్రాంతి ఇద్దరినీ కలుపుతానని చెప్పారు.

దీనిపై స్పందించిన ముద్రగడ..పవన్‌కే దిక్కులేదు తన కూతురికి టికెట్ ఇస్తారా అని మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ సీటుకే దిక్కు లేదని… భీమవరం, గాజువాకలో పవన్ ను తన్ని తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే జరగబోతోందని… చంద్రబాబు ఎస్టేట్ లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ కల్యాణ్ అని సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏమిటో పవన్ చెప్పాలని అన్నారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువు చెప్పారా? అని ప్రశ్నించారు.

Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

- Advertisement -