దుబాయ్‌లో ధోని,విరాట్

280
dhoni
- Advertisement -

ఐపీఎల్ ప్రారంభానికి కౌంట్ డౌన్ దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి టోర్ని ప్రారంభంకానుండగా కరోనా నిబంధనల మేరకు అన్ని ప్రాంఛైజీలు సిద్ధమయ్యాయి.కరోనా టెస్టులు పూర్తిచేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్,రాజస్ధాన్ రాయల్స్ ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్ చేరుకోగా తాజాగా చెన్నై,ఆర్సీబీ, ముంబై ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు.

ఈ విషయాన్ని ఆయా జట్ల ఫ్రాంఛైజ్ లు తమ ట్విట్టర్ ద్వారా తెలిపాయి.తన తల్లి అనారోగ్యం కారణంగా హర్భజన్ సింగ్ ఒక వారం ఆలస్యంగా దుబాయ్ కి వెళ్లనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు యుఏఈకి బయల్దేరాల్సి ఉంది.

- Advertisement -