క్రిస్మస్‌కి సందడిచేయనున్న అఖిల్..

218
akhil
- Advertisement -

అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘మిస్టర్ మజ్ను’ . బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు.

టీజర్‌తో అంచనాలు మరింతగా పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల
చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో ఈ సినిమాను జనవరి 25వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

తమన్ సంగీతం అందిస్తుండ‌గా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో క‌నిపించ‌నుంది.

- Advertisement -