ఆడిలైడ్‌లో ఆసీస్ చిత్తు….

202
bcci
- Advertisement -

ఆడిలైడ్‌లో భారత్ సత్తాచాటింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఆసీస్‌ను తొలిటెస్టులో చిత్తుచేసింది. బ్యాటింగ్,బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన భారత్  31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 119.5 ఓవర్లలో 291 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది.

ఓవర్ నైట్ స్కోరు 104/4తో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌ను షాన్ మార్ష్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. షాన్‌ మార్ష్‌(60), ట్రావిస్‌ హెడ్‌(14) ,ఆసీస్‌ సారథి పైన్‌(40) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ లక్ష్యం పెద్దది కావడం,సీనియర్ బ్యాట్స్‌ మెన్ ఎవరు క్రీజులోకి రాకపోవడంతో ఆసీస్ పరాజయం తప్పలేదు. భారత బౌలర్లలో బుమ్రా,షమీ,అశ్వీన్ఇ 3 వికెట్లు తీయగా ఇషాంత్ ఒక వికెట్ తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్:250
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌:235
భారత్ రెండో ఇన్నింగ్స్‌:310
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌:291

- Advertisement -