ప్రారంభమైన రెండో దశ పరిషత్ ఎన్నికలు

249
panchayat-elections
- Advertisement -

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రెండో దశలో మొత్తం 1,850 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగగా..63 స్ధానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. స్ధానిక సంస్ధలు ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈనెల 6న జరుగగా, రెండవ దశ నేడు జరుగుతుంది. ఇక మూడవ దశ ఈనెల 14 న నిర్వహించననున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని స్ధానాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసినట్టే.

- Advertisement -