- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటేందు ముందుకు వస్తున్నారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు కన్సల్టెంట్ గైనకాలాజిస్ట్ డా.వసుంధర కూకట్ పల్లిలోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.
పర్యవరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆమె కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం డా.త్రిపుర సుందరి,డా.పూర్ణిమ,డా.హిమదీప్తి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు డా.వసుంధర.
- Advertisement -