మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌..

342
MP Santosh Kumar
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని శామీర్ పేటలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని.. అందుకోసమే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని దాని ద్వారా ఇప్పటికే కోట్లాది మొక్కలను నాటడం జరిగింది అని అన్నారు.

దీనిలో చాలా మందిని భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుంది అని. పర్యావరణ పరిరక్షణ కోసం ఏ కార్యక్రమం చేపట్టినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ భాగస్వామి అవుతుందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్ గౌడ్, సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు శంబీపూరు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -