4వ రోజు…వలస కూలీలకు సంతన్న అన్నదానం

338
mp santhosh
- Advertisement -

సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ గారి పేరిట చేపట్టిన అన్నదానం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో 4వ రోజు కూడా అన్నదాన కార్యక్రమం నేడు జడ్పీటీసీ ఉమకొండయ్య ప్రారంబించారు .

సంతోష్ కుమార్ గారి పేరు మీద ఈరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కోదురుపాక గ్రామంలో సుమారు వంద మందికి మాజీ ఎంపీటీసీ బొల్లావేని భానుశ్రీ-తిరుపతి మరియు స్థానిక TRS నాయకుల సహకారంతో అన్నదానం చెయ్యడం జరిగింది.

అన్నదాత సుఖీభవ అని పెద్దలు ఉరుకనే అనలేదు.అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతన్న కి మా యొక్క కృతఙ్ఞతలు అని కత్తెరపాక కొండయ్య అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం వచ్చిన వలసకూలీలకు ఎంపీపీ వేణుగోపాల్ & ఎంపీడీఓ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఒద్దెల మహేందర్, అనుముల భాస్కర్, సందుల శ్రీనివాస్, పెంటల బల్ రెడ్డి, సారంపెళ్లి రవి, కమల్, ఆకుల కర్ణకర్, గుండా సాహెబు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు భోజనాలు వడ్డించారు.

- Advertisement -