వలసకూలీలు మా బిడ్డలే…ఎంపీ సంతోష్ హర్షం

250
santhosh
- Advertisement -

హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్నిరకాల సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడే ఉండి పనిచేసుకుంటామనే వలస కార్మికులకు తాము పని కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్ ప్రకటనతో ఎంపీ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్..వలసకార్మికులకు అండగా ఉంటానని సీఎం భరోసా కల్పించడం అమేజింగ్‌గా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రజలకే ఏం చేయలేని పరిస్ధితుల్లో ఉన్న సందర్భంలో ..సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలసకూలీలకు సహాయం చేసేందుకు ముందుకురావడం శుభపరిణామం అన్నారు.

- Advertisement -