కీసరలో ఎంపీ సంతోష్‌ ప్రత్యేక పూజలు..

582
mp santhosh
- Advertisement -

శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ సంతోష్ కుమార్‌. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , నవీన్ రావు ,శంబీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరస్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మహాశివరాత్రి సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ సంపద అయిన ఈ దేవాలయాన్ని కాపాడుకునేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు.

santhosh santhosh

- Advertisement -