కవితకు శుభాకాంక్షాలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్

512
Kavitha Santhosh kumar
- Advertisement -

నిమాబాద్ స్ధానిక సంస్ధల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్. ఈరోజు ఉదయం 11.30గంటలకు నిజమాబాద్ లో నామినేషన్ వేయనున్నారు. ఈసందర్భంగా కవితకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు శుభాకాంక్షాలు తెలియజేశారు.

తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కవితకు ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎక్కడున్నా ఆస్ధానానికి వన్నె తీసుకువస్తారని అన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ఈరోజు ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు కల్వకుంట్ల కవిత. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

- Advertisement -