తెలంగాణ ఉద్యమంలో ఓ జ్ఞాపకం…

372
trs santhosh
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. నాటి నుండి నేటివరకు సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన నేతలు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాత ఫోటోలను షేర్ చేస్తూ పార్టీ శ్రేణులకు విషెస్ చెప్పారు.

ఇక ఎంపీ సంతోష్ కుమార్ 2001 నాటి జలదృశ్యం నుండి ఉద్యమసమయంలో జ్ఞాపకాలను ట్విట్టర్‌ ద్వారా షేర్ చేశారు. తాజాగా కేటీఆర్‌తో ఉద్యమ సమయంలో ప్రజల మధ్య కూర్చుని ఉన్న ఫోటోని షేర్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఇలాంటి ఎన్నో మీటింగ్స్‌లో పాల్గొన్నామని ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -