శ్రీనివాస్ గౌడ్‌పై ఎంపీ సంతోష్ ప్రశంసలు

88
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో రీ ట్రాన్స్ లొకేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా
మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లోకేషన్ ద్వారా తిరిగి నాటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

శ్రీనివాస్ గౌడ్‌ ప్రయత్నాలను అందరు అభినందిస్తుండగా ఎంపీ సంతోష్ సైతం ప్రశంసలు గుప్పించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో వృక్షాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి పెకిలించి అలాగే తీసుకెళ్లి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో నాటించారు. ఇది మంచి ప్రయత్నమని అభినందించారు.

- Advertisement -